దాతృత్వ కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని పెంపొందించే గొప్ప సాధనమని రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీషాదేవి అన్నారు. రంపచోడవరం సమీపంలోని సిరిగిందలపాడు గ్రామంలో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “నారాయణ సేవ” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని స్వామి పరిజ్ఞయానంద ఆధ్వర్యంలో నిర్వహించగా, మిషన్ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వడం ద్వారా కలిగే సంతృప్తి ఎంతో విలువైనదని పేర్కొన్నారు. సమాజంలో అవసరమైన వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.

రామకృష్ణ మిషన్ సంస్థ వైద్య సేవలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆమె కొనియాడారు. ముఖ్యంగా పేదలు, గిరిజనులకు అందిస్తున్న సహాయం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
ఈ సందర్భంగా ఆమె చేతుల మీదుగా పలువురికి చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ సభ్యులు జానకిషా చైతన్య, ఇష్ట చైతన్య, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు అడబాల బాపిరాజు, సీతపల్లి బాపనమ్మ తల్లి దేవస్థానం సభ్యులు సిద్ధా వెంకన్నదొర, గూడెం బుజ్జిబాబు, పతివాడ రమణ తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news