పార్వతీపురం మన్యం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్మెట్ అవగాహన ర్యాలీని విశాఖ రేంజి ఐజీ గోపీనాథ్ జెట్టి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి సూచనలతో చర్చి జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, నాలుగు రోడ్ల జంక్షన్ మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని ఐజీ పిలుపునిచ్చారు.
హెల్మెట్ ధరించని కారణంగా రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, సుమారు 50 శాతం మరణాలు హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల్లో గాయాల తీవ్రతను తగ్గించుకోవచ్చని చెప్పారు.
ర్యాలీలో పోలీసులు, యువత పాల్గొని “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడుకోండి” వంటి నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం మీడియా సభ్యులకు హెల్మెట్లు పంపిణీ చేసి భద్రతపై మరింత చైతన్యం తీసుకురావాలని కోరారు. జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news