ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు బుధవారం కిర్లంపూడిలోని ఆయన స్వగృహం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు.
ముద్రగడ పద్మనాభం పార్థివదేహానికి జ్యోతుల నెహ్రూ ఘన నివాళులర్పించారు. అనంతరం ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముద్రగడ రాజకీయ జీవితాన్ని, ప్రజా ఉద్యమాల్లో ఆయన పాత్రను గుర్తు చేసుకున్నారు.
కాపు ఉద్యమ నేతగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా ముద్రగడ పద్మనాభం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారని పలువురు నేతలు పేర్కొన్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news