ఉత్తరప్రదేశ్లోని నోయిడా సెక్టార్-119లో ఉన్న అరణ్య సొసైటీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎత్తైన భవనంలోని 21వ అంతస్తులో ఉన్న ఓ ఫ్లాట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నివాసితులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ వెంటనే ఆరు ఫైర్ ఇంజిన్లను సంఘటనా స్థలానికి పంపించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రారంభ సమాచారం ప్రకారం ఎవరూ భవనంలో చిక్కుకోలేదని, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎయిర్ కండిషనర్ పేలుడు కారణంగా మంటలు ప్రారంభమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం దర్యాప్తు పూర్తయిన తర్వాతే నిర్ధారణ అవుతుందని అధికారులు తెలిపారు. భవనం నుంచి దట్టమైన పొగలు ఎగసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు
Fetching videos...
Fetching latest news...
No trending news