రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో కోడూరు రూరల్ సీఐ డీ. శ్రీనివాసులు చిట్వేల్, పెనగలూరు మండలాల్లోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు నిష్పాక్షికంగా, ప్రశాంతంగా జరిగేలా భద్రతా ఏర్పాట్లను సమీక్షించి పోలీస్ సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
కేంద్రాల వద్ద గుంపులుగా చేరే వారిపై 144 సెక్షన్ అమలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాస్ కాపీయింగ్కు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news