చీరాల మండలం సావరపాలెం గ్రామంలో పశు సంవర్థక శాఖ మరియు మార్కెట్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఈ శిబిరంలో గర్భకోశ వ్యాధులు ఉన్న పశువులకు ఉచిత గర్భధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. పశు సంపద అభివృద్ధి కోసం ప్రభుత్వం పశు భీమా, 50% సబ్సిడీతో పశుదాణ, నాణ్యమైన మందుల పంపిణీ వంటి పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే వివరించారు.

అదేవిధంగా గొర్రెలకు నట్టల నివారణ మందుల పంపిణీ ఏప్రిల్ నెలలో చేపట్టనున్నట్లు, గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో సెక్స్ సార్టెడ్ సెమన్ ద్వారా ఎక్కువగా పెయ్యి దూడలు జన్మించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలు పార్టీ నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news