టీబీ నిర్మూలన లక్ష్యంగా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న టీబీ ముక్త భారత్ అభియాన్ 2.0 కార్యక్రమం కింద నిమ్మనపల్లి మండలంలో ఇంటింటికీ వెళ్లి HH X-Ray సేవలు అందిస్తున్నారు. ఎంపీడీవో డి. పక్రుద్దీన్ సాహెబ్ మాట్లాడుతూ ప్రజలు ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రూ.16 లక్షల విలువైన హ్యాండ్ హోల్డ్ ఎక్స్రే యంత్రంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుమారు 70 మందికి ఛాతి పరీక్షలు నిర్వహించారు.
మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రత్యూష తెలిపిన వివరాల ప్రకారం, టీబీ ప్రభావిత గ్రామాల్లో ఇంటింటికీ సర్వే నిర్వహిస్తూ లక్షణాలపై అవగాహన కల్పిస్తున్నారు. రెండు వారాలకంటే ఎక్కువ దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమం ద్వారా ఉచిత పరీక్షలు, మందులు, పోషకాహార సహాయం అందిస్తుండగా, టీబీ పూర్తిగా నయం అయ్యే వ్యాధి కావడంతో భయపడకుండా ముందుకు రావాలని అధికారులు కోరారు. గ్రామ సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు సహకారంతో కార్యక్రమం కొనసాగుతోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news