హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న టీజీ20 లీగ్-2026కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్ కావడంతో కరీంనగర్ డైమండ్స్–వరంగల్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్కు స్టేడియం కిక్కిరిసిపోయింది. చిన్నారులు, యువత, కుటుంబాలతో కలిసి వచ్చిన అభిమానులు ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ సందడి చేశారు. ఫోర్లు, సిక్సర్లు బాదిన ప్రతిసారీ చప్పట్లు, కేరింతలతో ఉప్పల్ మైదానం మార్మోగిపోయింది. ప్రేక్షకుల ఉత్సాహం, స్టేడియంలోని సందడి ఐపీఎల్ మ్యాచ్ను తలపించేలా కనిపించింది. స్థానిక ప్రతిభకు వేదికగా నిలుస్తున్న టీజీ20 లీగ్పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతుండగా, ప్రతి మ్యాచ్కు అభిమానుల సంఖ్య కూడా పెరుగుతోంది. యువ క్రికెటర్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశంగా ఈ లీగ్ మారిందని నిర్వాహకులు చెబుతున్నారు. అభిమానుల ఆదరణతో టీజీ20 లీగ్ తెలంగాణ క్రికెట్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తూ విజయవంతంగా కొనసాగుతోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news