ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో 300 పోస్టుల భర్తీకి నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు ఏప్రిల్ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పోస్టులకు అర్హతలు వేరువేరుగా ఉండగా, కొన్ని పోస్టులకు 7వ తరగతి విద్యార్హత సరిపోతుంది. మిగిలిన పోస్టులకు డిగ్రీ, బీటెక్ లేదా లా డిగ్రీ అవసరం ఉంటుంది.
ఈ నియామక ప్రక్రియలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)తో పాటు కొన్ని పోస్టులకు స్కిల్ టెస్టు కూడా నిర్వహించనున్నారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు విషయంలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400గా నిర్ణయించగా, ఇతర అభ్యర్థులకు రూ.800గా ఉంది.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,000 నుంచి రూ.1,47,760 వరకు జీతం అందించనున్నారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా హైకోర్టు విభాగాల్లో అవసరమైన సిబ్బందిని భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news