తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల సీబీఐ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. రూ.105.44 కోట్ల రుణ మోసం వ్యవహారంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది. నకిలీ పత్రాల ఆధారంగా రుణాలు పొందినట్లు వచ్చిన ఆరోపణలపై ఎన్సీఎస్ షుగర్స్ లిమిటెడ్ డైరెక్టర్లు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులపై దర్యాప్తు చేపట్టింది.
ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాల్లోని పలు ప్రదేశాల్లో సీబీఐ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఎన్సీఎస్ షుగర్స్ ఫ్యాక్టరీ, కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను సేకరించారు.
దర్యాప్తులో భాగంగా అధికారులు పలు ముఖ్యమైన పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రుణాల మంజూరు ప్రక్రియ, సమర్పించిన పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news