భారత యువ టెన్నిస్ ఆటగాడు అర్ణవ్ పాపర్కర్ వింబుల్డన్ జూనియర్స్ 2026 టోర్నీలో చరిత్ర సృష్టించాడు. 36 ఏళ్ల తర్వాత వింబుల్డన్ జూనియర్స్ బాలుర సింగిల్స్ క్వార్టర్ ఫైనల్కు చేరిన తొలి భారతీయుడిగా అరుదైన ఘనత సాధించాడు. ప్రీక్వార్టర్ ఫైనల్లో జపాన్కు చెందిన ర్యో టబాటాపై 6-2, 6-1 తేడాతో కేవలం 52 నిమిషాల్లోనే విజయం సాధించిన అర్ణవ్ అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అంతకుముందు తొలి రౌండ్లో బ్రిటన్ ఆటగాడు జోషువా క్రేజ్ను, రెండో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ కీటన్ హాన్స్ను వరుస సెట్లలో ఓడించి సంచలనం సృష్టించాడు. ఇప్పటివరకు టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా క్వార్టర్ ఫైనల్కు చేరుకోవడం విశేషం.
ఇప్పుడు అర్ణవ్ క్వార్టర్ ఫైనల్లో అమెరికాకు చెందిన జోర్డాన్ లీతో తలపడనున్నాడు. ఈ మ్యాచ్లో గెలిస్తే సెమీఫైనల్కు చేరి మరో చారిత్రాత్మక మైలురాయిని అందుకునే అవకాశం ఉంటుంది. భారత టెన్నిస్ అభిమానుల ఆశలు ఇప్పుడు అర్ణవ్పైనే నిలిచాయి.
వింబుల్డన్ జూనియర్స్ బాలుర సింగిల్స్ టైటిల్ను ఇప్పటివరకు కేవలం ముగ్గురు భారతీయులు మాత్రమే గెలిచారు. 1954లో రామనాథన్ కృష్ణన్, 1979లో రమేశ్ కృష్ణన్, 1990లో లియాండర్ పేస్ ఈ ఘనత సాధించారు. ఇప్పుడు అర్ణవ్ పాపర్కర్ కూడా ఆ దిగ్గజాల జాబితాలో చేరేందుకు మరో అడుగు దూరంలో నిలిచాడు. అతని అద్భుత ప్రదర్శన భారత టెన్నిస్కు కొత్త ఆశలను నింపుతోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news