ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా చీరాల నియోజకవర్గంలో ఘన నివాళులు అర్పించారు. చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మద్దులూరి మహేందర్ నాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొని రోశయ్య గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరాడంబరత, నిజాయితీ, ఆర్థిక క్రమశిక్షణతో కూడిన ప్రజాపాలనకు రోశయ్య గారు ఒక ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలను నిలబెట్టిన ఆయన జీవితం నేటి తరానికి మార్గదర్శకమని అభిప్రాయపడ్డారు. ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
MGC మార్కెట్ కమిటీ ఆహ్వానం మేరకు మార్కెట్ కార్యాలయంలో రోశయ్య గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం చీరాల పట్టణ క్లాత్ మార్కెట్ సెంటర్లో ఉన్న రోశయ్య గారి కాంస్య విగ్రహానికి కూడా పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో MGC మార్కెట్ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సోదరులు, కూటమి నాయకులు పాల్గొని రోశయ్య గారి సేవలను స్మరించుకున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news